Dec 7, 2009

బస్సు కస్సుబుస్సు

 "రాష్ట్రం లో ఎక్కడికి వెళ్ళాలి అన్నా చాలా మంది మమ్మల్నే  ఆశ్రయిస్తుంటారు.పది నిముషాలు ఆలస్యం గ వస్తే పట్టరాని కోపం తో ఉగిపోతుంటారు..ఎప్పుడు  ఆందోళన జరిగిన బస్సు ల మీదనే ప్రాతాపం చూపిస్తారు.ఇప్పటిదాకా ఈ అయిదు రోజులలోనే దాదాపు 160 బస్సులు తగలబెట్టారు.50 మందిని మోసే సామర్ధ్యం ఉన్న మా మీద 100 మంది పఇగా ఎక్కినా  మేము అభిమానంతో,ఆయాసం తో మోస్తున్నామే,స్టూడెంట్స్ ను Rs .80 కే సిటీ మొత్తం నెల రోజుల పాటు ఎక్కడికంటే అక్కడకి చేరావేస్తున్నమే,వికలాంగులకు,freedom fighters కు ఫ్రీ గ సేవ చేస్తున్నామే,,మన రాష్ట్రం లో ఉన్న ప్రతి వ్యక్తీ ఏదో ఒక రోజు ఈ బస్స్ ఎక్కినవడేగా  ... తగాలబెట్టేటప్పుడు వాడికి నా సేవలు గుర్తు రాలేదా??కూర్చున్న కొమ్మనే నరుక్కున్టున్నదే..ఇప్పటికే బస్సులు చాలటం లేదు కొన్ని కొత్త బస్సులు వేయండి అని  ధర్నా చేస్తున్నారే మరి  అలాంటప్పుడు ఉన్నవాటిని కూడా మీరు నాశనం చేస్తున్నారే..మళ్ళి ఈ బందులు గట్రా అయిపోయి అందరు ఒక మాట మీదకు రాగానే మళ్ళి మా బస్సుల లోనే గ మీరు తిరిగేది.. ఆనందించేది.. మీరు కోపం ప్రదర్శించడానికి మేమే బలిఅవ్వాలి, ఎన్నో మైళ్ళ దూరం వెళ్లి మిమ్మల్ని సురక్షితం గ గమ్యం చేర్చటానికి కూడా మేమే బలి అవ్వాలి...అయిన ఇది అంతా మాకు కూడా అలవాటు అయింది లెండి..అందుకే బంద్ అన్న మాట వినగానే మాకు చలిజ్వరం వచ్చినట్టు   అయ్యి ఒక మూల న దాక్కున్తున్నాం..ఇప్పటికన్నా మీ కోపం మా మీద చూపకుండా ఉంటె బాగుంటుంది అని ప్రార్ధిస్తున్నాను ".............
ఇది ఇవ్వాళ న్యూస్ పేపర్ లో బస్సుల ఆత్మఘోష అని ఒక కాలమ్ లో వచ్చింది .. దానిలో కొన్ని మాటలు తీసుకుని కొన్ని నేనే సొంతం గ కలిపి రాసాను...

No comments:

Post a Comment